1) జలధీశ్వరాలయం : మన గ్రామములోకెల్లా అతి ప్రాచీన ఆలయం ఇదే.మన గ్రామానికి అత్యంత ప్రతిష్టను తీసుకొచ్చిన ఆలయం కూడా ఇదే దీనికి ఎర్రగుడి అనికూడా పేరు ఉండేదట.పూర్వము దీనికి 300 ఎకరాల మాన్యం ఉండేది,తరువాత దానిని చల్లపల్లి జమిందారు తీసుకుని పడమటి పొలం ఏడు ఎకరాలు ఉంచారని అర్చకులు చెపుతారు.1950 నుంచి కొంతకాలం దోనేపూడి సీతారామయ్య,గొర్రెపాటి వెంకట్రామయ్య,గొర్రెపాటి బాపనయ్య ధర్మకర్తలు గా వ్యవహరించారు.వారి హయాం లోనే ప్రజల విరాళాలతో 1953 లో ధ్వజస్తంభానికి ఇత్తడితొడుగు చేయించారు.మళ్లీ ఇటీవల 2009 లో స్వాతి పత్రిక అధినేత శ్రీ వేమూరి బలరాం మరియు ప్రజల భాగస్వామ్యం తో నూతన ధ్వజస్తంభప్రతిష్ట జరిగినది.మరియు నూతనంగా నిర్మించిన గాలిగోపుర నిర్మాణానికి ప్రవాసాంధ్రుడు అయినపూడి వెంకట్రామయ్య 3 లక్షల రూపాయలు విరాళంగా అందచేశారు.