2019 వ సంవత్సరం మే నెలలో లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజక వర్గానికి శాసన సభ్యుడు గా శ్రీ సింహాద్రి రమేష్ బాబు ఎన్నికయ్యారు.
. ...readmore. ...readmore
గ్రామంలో ఉన్న జలధీశ్వర సహకార బాంక్ కి చైర్ పర్సన్ గా శ్రీ దోనేపూడి రాఘవేంద్రరావు గారిని ప్రభుత్వం నామినేట్ చేసింది.31.07.2019 నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆయన పదవిలో కొనసాగుతారు.
. ...readmore
. ...readmore
1) జలధీశ్వరాలయం : మన గ్రామములోకెల్లా అతి ప్రాచీన ఆలయం ఇదే.మన గ్రామానికి అత్యంత ప్రతిష్టను తీసుకొచ్చిన ఆలయం కూడా ఇదే దీనికి ఎర్రగుడి అనికూడా పేరు ఉండేదట.పూర్వము దీనికి 300 ఎకరాల మాన్యం ఉండేది,తరువాత దానిని చల్లపల్లి జమిందారు తీసుకుని పడమటి పొలం ఏడు ఎకరాలు ఉంచారని అర్చకులు చెపుతారు.1950 నుంచి కొంతకాలం దోనేపూడి సీతారామయ్య,గొర్రెపాటి వెంకట్రామయ్య,గొర్రెపాటి బాపనయ్య ధర్మకర్తలు గా వ్యవహరించారు.వారి హయాం లోనే ప్రజల విరాళాలతో 1953 లో ధ్వజస్తంభానికి ఇత్తడితొడుగు చేయించారు.మళ్లీ ఇటీవల 2009 లో స్వాతి పత్రిక అధినేత శ్రీ వేమూరి బలరాం మరియు ప్రజల భాగస్వామ్యం తో నూతన ధ్వజస్తంభప్రతిష్ట జరిగినది.మరియు నూతనంగా నిర్మించిన గాలిగోపుర నిర్మాణానికి ప్రవాసాంధ్రుడు అయినపూడి వెంకట్రామయ్య 3 లక్షల రూపాయలు విరాళంగా అందచేశారు.
. ...readmoreగ్రామ జనాభా 2001 జనవరి నాటికి
. ...readmore దేశ స్వాతంత్ర సముపార్జన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి.ప్రజల అవసరాలను తీర్చడానికై పంచాయితీరాజ్ వ్యవస్థ ఏర్పడింది.దాని పర్యవసానంగా మన గ్రామానికి కూడా పంచాయితి ఏర్పడింది.18-04-1918లో ఘంటసాలలో తొలి అధ్యక్ష పాలన ప్రారంభమైంది.తొలుత ఘంటసాల పాలెం,మరియు ఘంటసాల కలిసే ఉండేవి.ఎన్నికలు కూడా ఉమ్మడిగానే జరిగేవి.కాని పార్టీ కక్షల కారణంగా 1938 సెప్టెంబర్ 21న విడదీయుట జరిగినది.
ఘంటసాల మండల పరిషత్ పాలక వర్గం