Temples Information

  • శ్రీ పెన్నేరమ్మ గుడి

     గ్రామం నడిబొడ్డున ఉన్న గుడి ఇది 130 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడి శిధిలం అయిపోగా 1952 లో గొర్రెపాటి వెంకట్రామయ్య గారు చందాలు పోగు చేసి మండపం కట్టించారు. ప్రస్తుతం దీనిని బస్సు షెల్టర్ గా గ్రామస్తులు వినియోగిస్తున్నారు.

    . ...readmore

  • ముత్యాలమ్మ గుడి

    . ...readmore

  • శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయం

     మన ఊరిలో తప్ప ప్రపంచం లో మరెక్కడా వినపడని కనపడని ఆలయం మన జలధీశ్వరాలయం.ఇటీవల కాలంలో బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయం గా మరింత ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఆగస్త్య మహాముని చేత ప్రతిష్టించబడిన ఈ ఆలయం మహిమాన్విత పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ స్వామి వారికి జలాభిషేకం చెయ్యరు.లింగం విభూది పూతతో తెల్లగా ఉంటుంది.ఈ గుడిలో జలధీశ్వరితో పాటు స్వామివారు ఒకే పానపట్టం పై వెలసి ఉన్నారు.

    . ...readmore

  • భౌద్ధ స్తూపం

     ఈ స్తూపం ఘంటసాలకు ఈశాన్య భాగాన ఉంది.వాడుక భాషలో మనందరికి తెలిసిన దీని పేరు లంజదిబ్బ.కాని అతి పవిత్రమైన ఈ స్తూపాన్ని అలా పిలవటం సరికాదు.1870లో మొదటిసారిగా ఈ స్తూపం వెలుగులోకి వచ్చింది.అప్పటి కలెక్టర్ అయిన బాస్పెల్ మొదటిసారిగా స్తూపాన్ని గురించి ప్రభుత్వానికి తెలియచేశారు.ఆ తరువాత 1906 లో పురావస్తు శాఖాధికారి అయిన అలెగ్జాండర్ రే స్తూపాన్ని తవ్వించి ఒక రిపోర్టును ప్రచురించాడు.

    . ...readmore

  • భావనాఋషి ఆలయం

    నేటి ఘంటసాల గ్రామం సుమారు 300సంవత్సరాలక్రితముది గానే మనకి తెలుసు.శతాబ్దాలనాటి చరిత్ర తెలుసుకోవటానికి ఖచ్చితమైన ఆధారాలు లేవునేటి ఘంటసాలకి ప్రాచీనులు బ్రాహ్మణులు,విశ్వబ్రాహ్మణులు,కాపులు,ముత్తరాచులు అని తెలియటానికి ఆధారాలున్నవి.

    . ...readmore

  • పురావస్తు శాఖ మ్యూజియం


    ఎన్నో సంవత్సరాల తపస్సు,మరెంతోమంది మహానుభావుల కృషీఫలం మన మ్యూజియం.19వ శతాబ్ధపు ప్రధమంలో ప్రజలకు అవగాహన లేక దొరికిన బౌద్ధ అవశేషాలను,మరియు పాలరాతి శిల్పాలను,చాకలి బండలు గాను ,పిల్లలు వాటిని పగులగొట్టి గోడలపైన రాసే చాక్ పీసులుగాను వాడేవారు.అప్పటి వారి అవగాహనాలేమి వల్ల అరుదైన మన శిల్ప సంపద అంతా పారిస్ లోని గుయ్ మెట్ మ్యూజియం కి తరలిపొయింది.

    . ...readmore

  • విశ్వేశ్వరాలయం

     జలధీశ్వరాలయం తర్వాత అతి ప్రాచీనమైనది మన విశ్వేశ్వరాలయం.ఈ ఆలయం శిధిలమైపోగా బోలెం గుంటలో లింగాకారమును తెచ్చి మట్టి ఆడుసు తో చిన్న ఆలయమును కట్టించారు.కొంతకాలానికి అదీ శిధిలమైపోగా రెంటచింతల అచ్చన్న అనే ఆయన కాశీ నుంచి ఒక లింగమును తెచ్చి వేమూరి ఘంటయ్య గారి సహకారముతో ఇపుడు ఆలయమున్న ప్రదేశంలో 1860లో నిర్మించారు.

    . ...readmore

  • సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయం

    ఈ గుడి ని 1813లో గొర్రెపాటిచెంచయ్య గారి కుమారుడు కృష్ణమ్మ జలధీశ్వరాలయ ప్రాంగణంలో కట్టించారు .ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఊరి ఆడపడుచుల గుడి .షష్టి గుడి గా అందరికీ సుపరిచితమైనది.నాటి నుంచి నేటి వరకు మార్గశిర శుద్ధ షష్టి కి సుబ్బారాయుడి కల్యాణం రంగ రంగ వైభవంగా జరుగుతుంది .

    . ...readmore

  • వేణుగోపాలస్వామి ఆలయం


     

    . ...readmore