శ్రీ ఎనిగళ్ళ వెంకటరత్నం అస్తమయం Back to list

 శ్రీ ఎనిగళ్ళ వెంకటరత్నం అస్తమయం 


విశ్రాంత ఉపాధ్యాయులు,మన గ్రామానికి చెందిన శ్రీ ఎనిగళ్ళ వెంకటరత్నం గారు 18.12.2012 న విజయవాడ లోని వారి స్వగృహంలో దివంగతులయ్యారు.ఆయన వయస్సు 85 సంవత్సరాలు.దేవరకోటకి చెందిన వేమూరి కనకవల్లీశ్వరమ్మ గారు వీరి సతీమణి. భార్యా భర్తలిద్దరూ ఉపాధ్యాయులే. వృత్తి రిత్యా విజయవాడలోనే స్థిరపడ్డారు.వీరికి ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు.వెంకటరత్నం గారు ఉపాధ్యాయులుగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచారు.వారి పిల్లలనే కాకుండా వారి స్నేహితుల, బంధువుల పిల్లలకి విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, తమ సంరక్షణలోనే ఉంచుకుని నేర్పటం ద్వారా వారి ఉన్నతికి తోడ్పడ్డారు. నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న ఎంతో మంది ఉద్యోగస్తులు,వ్యాపార రంగం లో ఉన్నవారు వారిని తల్లిదండ్రులుగా గౌరవిస్తారు.
ప్రస్తుతం సినీ రంగంలో హీరోగా ఉన్న నవదీప్ ఈయన కుమార్తె మాధవి కుమారుడు.ఈ వార్త విన్న వెంటనే విజయవాడ పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్ లో ఉన్న వారి నివాసం ఆప్తులతోనూ బంధువులతోనూ కిక్కిరిసిపోయింది.వారి ఆత్మకి శాంతి కలగాలని,వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్డ్ని ప్రార్దిస్తున్నాం.
 
 
మనవలు,మనుమరాళ్ళతో (పాత చిత్రం)
 

కుమారుడు ఎనిగళ్ళ నరేంద్రబాబు : +919440051299

Dated : 19.12.2012