బాలకృష్ణ పర్యటన విజయవంతంBack to list

బాలకృష్ణ పర్యటన విజయవంతం

08.01.2012 నందమూరి బాలకృష్ణ పర్యటన మన గ్రామంలో విజయవంతంగా జరిగింది.తన తండ్రి విగ్రహావిష్కరణ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలకృష్ణ తన ప్రసంగం తో పార్టీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపారు. దారి పొడుగునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో గ్రామం అంతా పసుపుమయం అయ్యింది. బస్టాండ్ జన సముద్రం తో పోటెత్తింది.

పక్క గ్రామాలనుంచి జనం విపరీతం గా రావటం తో రోడ్డ్లన్ని కిక్కిరిసి పోయాయి. కొడాలి నుంచే ట్రాఫిక్ జామ్ అవ్వటంతో చాలామంది తమ కాళ్ళకి పని చెప్పాల్సి వచ్చింది.హైస్కూల్ దగ్గర్నుంచి ఎడ్ల బండి మీద బాలయ్యని స్థానిక నాయకులంతా ఊరేగింపుగా విగ్రహం వద్దకు తీసుకొచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం పాలాభిషేకం చేశారు.ఒక్క మగాడు సినిమా లో డైలాగ్ చెప్పటం తో సభికులంతా పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. తానా మాజీ అధ్యక్షులు శ్రీ గొర్రెపాటి నవనీత కృష్ణ ,గొర్రెపాటి రవి, స్థానిక నాయకులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, బండి పరాత్పర రావు,కాకుమాని రంగారావు,తుమ్మల వెంకటేశ్వరరావు,వడ్లమూడి కొత్త బంగారం,పలువురు TDP కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Click here for more Pictures