Latest News

  • శ్రీ వేమూరి వెంకట కృష్ణారావు అస్తమయం

     ప్రముఖ రాజకీయ వేత్త, విద్యాధికులు, ఘంటసాల పాలెం గ్రామ ప్రముఖులు, శ్రీ  వేమూరి వెంకట కృష్ణారావు గారు 15.04.2012 న గ్రామంలో తమ స్వగృహం లో తుది శ్వాస విడిచారు. అయన వయసు 84 సంవత్సరాలు.1929 వ సంవత్సరంలో శ్రీ వేమూరి వెంకయ్య గారికి మొదటి సంతానం గా జన్మించారు. ఘంటసాల పాలెం గ్రామ పంచాయితీ ఏర్పడినప్పుడు తొలి ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    . ...readmore

  • రాజ్యలక్ష్మి డీలక్స్ కూల్చివేత

     ఇన్ని రోజులుగా మూగ సాక్షి గా మిగిలిన రాజ్యలక్ష్మి డీలక్స్ ఇక ఆనవాలు లేకుండా కాలగర్భం లో కలిసిపోయింది.వెలుగుల్ని జిమ్మిన ఆ వెండితెర కరిగి పోయి దాని వెనకున్న మొండిగోడల్ని నగ్నం గా మిగిల్చిన విషాదం కళ్ళముందే కనిపిస్తుంటే, ఠీవీ గా బాల్కనీ పిట్టగోడపై కాళ్ళు పెట్టుకుని సినిమా చూసిన ఆ ఎత్తులు, పల్లానికి జారిపోతుంటే

    . ...readmore

  • బండి వెంకటేశ్వరరావు హత్య

     కొడాలి గ్రామంలో ప్రముఖ రాజకీయ నాయకుడు,Y.S.R కాంగ్రెస్  పార్టీ కార్యకర్త బండి వెంకటేశ్వరరావు ఈ రోజు ఉదయం దారుణ హత్య కి గురయ్యారు.ఘంటసాల గ్రామం నుంచి చిట్టూర్పు వెళ్ళే జోడుగుడెం రహదారిలో ఈ హత్య జరిగింది. 

    . ...readmore

  • డల్లాస్ లో కృష్ణా సంబరాలు

    . ...readmore

  • వైభవంగా విగ్రహ ప్రతిష్ట

     స్థానిక రజకుల రామాలయంలో విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే, మంత్రి  శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ప్రత్యేక అతిధిగా విచ్చేసారు. దేవాలయ కమిటీ సభ్యులు, పలువురు గ్రామస్తులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

    . ...readmore

  • రజకుల రామాలయ విగ్రహ ప్రతిష్టాపన

     శిధిలావస్థకి చేరిన రజకుల రామాలయ మందిరాన్ని స్థానిక పెద్దలంతా కలిసి విరాళాలు ప్రోగు చేసి, మళ్ళీ పునర్నిర్మించారు. ఈ నెల 18 న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనం గా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇది వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ వేడుక జయ ప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

    . ...readmore

  • ఘనంగా శివరాత్రి వేడుకలు

     స్థానిక జలధీశ్వర మరియు విశ్వేశ్వరాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనం గా జరిగాయి.భక్తులు పెద్ద సంఖ్య లో విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు.

    . ...readmore

  • శనివారం అంత్యక్రియలు

    వెంకట్రాయులు గారి మృతి వార్త తెలిసిన వెంటనే పలువురు గ్రామస్తులు, హైదరాబాదులో ఉన్న వారి బంధువులంతా లక్డికాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన కుమారులు నలుగురు మరియు కుమార్తె కూడా అమెరికాలోనే ఉండటంతో వారు వచ్చేవరకు ఆసుపత్రి లోనే ఆయన భౌతిక కాయాన్ని భద్రపరిచారు.

    . ...readmore

  • శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు అస్తమయం

      గొర్రెపాటి వెంకట్రాయులు విద్యా ట్రస్ట్ అధినేత శ్రీ గొర్రెపాటి వెంకట్రాయులు గారు కొద్ది సేపటి క్రితం దివంగతులయ్యారు.ఆయన వయసు 90 సంవత్సరాలు.పొద్దున్న ఒంట్లో నలత గా ఉండటం తో చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాదు లో  గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు.పరిస్తితి విషమించటం తో రాత్రి 10.15 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.

    . ...readmore

  • గొర్రెపాటి వివాహ ఆహ్వానం

     మా ఏకైక కుమారుడు రామనాద్ వివాహం 12.02.2012 న మచిలీపట్నంలో జరగనుంది. సమయాభావం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరూ అన్యధా భావించక ఇది మా వ్యక్తిగత ఆహ్వానముగా స్వీకరించి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన.

    . ...readmore

  • జలధీశ్వరస్వామి ఆన్ లైన్ పూజలు ప్రారంభం

     దూర ప్రాంతాల్లో ఉండే స్వామి వారి భక్తుల సౌకర్యార్ధం ఈ కింది సేవలను ఆన్ లైన్ ద్వారా కూడా అందుబాటులో ఉంచటం జరిగినది.కనుక ఈ సేవలను భక్తులు విశేషముగా ఉపయోగించుకుని స్వామి వారి సేవకు పాత్రులు కాగలరు.


    . ...readmore