అమరరాజా బ్యాటరీస్ అధినేత శ్రీ గల్లా రామచంద్రనాయుడు మన గ్రామానికి విచ్చేశారు. చిరకాల మిత్రుడు అయిన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు ఆయనను వెంటబెట్టుకుని తీసుకురాగా ఆలయంలో అర్చకులు ఘన స్వాగతం పలికారు. 21.01.2012 శని త్రయోదశి కావటంతో అప్పటికే పూజలు జరిపించుకుంటున్న భక్తులతో పాటుగా, అయన కూడా ప్రత్యేక పూజలు జరిపించారు.
. ...readmoreగొర్రెపాటి రవి తన తండ్రి స్మారకార్ధం రూపొందించిన కాలెండర్ ని ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు.
. ...readmore. ...readmore
. ...readmore
. ...readmore
వాతావరణం అనుకూలించని కారణంగా జనవరి 12 వ తారీఖున జరగాల్సిన ఎడ్ల పందాలు వాయిదా పడ్డ సంగతి విదితమే. ప్రస్తుతం వాతావరణం అనుకూలించటంతో 14 నుంచి యధావిధి గా జరగనున్నాయి.ఈ మార్పు ని గమనించి వీక్షకులంతా విచ్చేసి పందాలను విజయవంతం చేయవలసిందిగా కమిటీ విజ్జ్ఞాప్తి చేసింది.
. ...readmoreనందమూరి బాలకృష్ణ పర్యటన మన గ్రామంలో విజయవంతంగా జరిగింది.తన తండ్రి విగ్రహావిష్కరణ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలకృష్ణ తన ప్రసంగం తో పార్టీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపారు. దారి పొడుగునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో గ్రామం అంతా పసుపుమయం అయ్యింది. బస్టాండ్ జన సముద్రం తో పోటెత్తింది.
. ...readmoreఘంటసాల పాలెం గ్రామం లో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 13.12.2011 న ప్రారంభించారు. పాలెం వాస్తవ్యులు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అయిన శ్రీ జాస్తి బలరామయ్య గారు దాదాపు 15 లక్షల రూపాయల వ్యయం తో దీనిని నిర్మించారు.తాను పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలనే తలంపుతో గ్రామస్తుల అభీష్టం మరియు అవసరాల మేరకు అందరికి ఉపయోగం గా ఉండాలనే ఆశయంతో తనకు జన్మ నిచ్చిన తల్లిదండ్రుల పేరిట తన జన్మస్థలమైన ఘంటసాల పాలెం గ్రామాభివృద్దికి తన వంతు సహకారం అందించటం సంతోషం గా ఉందని ఆయన తెలియ చేశారు
. ...readmoreసంవత్సర కాలం గా ఎదురు చూస్తున్న ఎన్ టి ఆర్ విగ్రహావిష్కరణకి మోక్షం లభించింది.జనవరి 8 న నందమూరి బాలకృష్ణ మన గ్రామానికి విచ్చేయనున్నారు.
. ...readmoreఇటివలే సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి గా నియమితులైన శ్రీ జాస్తి చలమేశ్వర్ గారికి జలదీశ్వరాలయం లో ఘన సన్మానం జరిగింది. చలమేశ్వర్ గారి స్వగ్రామం పెదముత్తేవి. అయన గతంలో పలు హైకోర్టులలో న్యాయమూర్తి గా పని చేశారు.
. ...readmoreప్రవాసాంధ్రుడు ప్రముఖ విద్యా వేత్త శ్రీ మూల్పూరి వెంకట్రావు గారి దంపతులకు ఈ రోజు జలదీశ్వరాలయ కమిటీ తరపున ఘన సన్మానం చేశారు.విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు India International Friendship Society ప్రతి సంవత్సరం GLORY OF INDIA అవార్డు ని అందిస్తుంది.ఈ సంవత్సరం ఈ అవార్డ్ ని శ్రీ మూల్పూరి వెంకట్రావు గారికి జనవరి 11న ప్రవాసి భారతీయ దివస్ సందర్భం గా కేంద్రమంత్రి శ్రీ పవన్ కుమార్ భన్సాల్ చేతుల మీదుగా అందించనున్నారు.
. ...readmore