భూమండలంలో శివ పార్వతులు ఏక పీఠం పై ఉన్న ఏకైక దేవాలయం
జలధీశ్వరాలయం
మన ఊరిలో తప్ప ప్రపంచం లో మరెక్కడా వినపడని కనపడని ఆలయం మన జలధీశ్వరాలయం.ఇటీవల కాలంలో బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయం గా మరింత ప్రాచుర్యం లోనికి వచ్చింది.ఆగస్త్య మహాముని చేత ప్రతిష్టించబడిన ఈ ఆలయం మహిమాన్విత పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందింది విశేషం .లింగం విభూది పూతతో తెల్లగా ఉంటుంది.ఈ గుడిలో తో పాటు స్వామివారు ఒకే పానపట్టం పై వెలసి ఉన్నారు.
శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి
ఏకపీఠే విరాజంతం సర్వమంగళయా సహా '
ఘంటసాల పురాధీశం జలధీశ్వర ఉపాస్మహే "
భస్మాలంకృత సర్వాంగం అగస్త్యేన ప్రతిష్ఠితం '
భక్తాభీష్టప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే "
జలధీశ్వరాలయ స్థలపురాణం
పార్వతీదేవి కల్యాణం చుడటానికి సమస్త ప్రాణికోటి ఉత్తరాపధమునకు పొయినది.
పార్వతీ పరమేశ్వరులు ఏకపీఠంపై ఉన్న ప్రాచీన క్షేత్రం.దక్షిణ కైలాసంగా ఈ ఆలయాన్ని ప్రజలు భావిస్తారు.ఈ ఆలయ విమాన శిఖరం ఇతర ఆలయాలకు భిన్నంగా మూడు శిఖరాలతో గజపృష్టాకారం గా ఉంటుంది.జలధీశ్వరుడు భక్తసులభుడు.స్వామిభక్తుల కోర్కెలు తీర్చే భక్తసులభుడు
ఆలయంలో ప్రతి సోమవారం విశేష రుద్రాభిషేకం,ప్రతిరోజూ ఉదయం అయ్యవారికి అభిషేకం,ప్రతిరోజూ సాయంత్రం అమ్మవారికి అష్టోత్తరనామార్చన,లలిత సహస్రనామ పారాయణం,ప్రతి శుక్రవారం అమ్మవారికి స్థపన,సహస్ర కుంకుమార్చన ,పౌర్ణమి రోజున శ్రీ సూక్తసహిత అమ్మవారికి స్థపన,సహస్ర కుంకుమార్చన,శుద్ధ చతుర్దశి రోజున మహాన్యాస పూర్వక ఏకవారభిషేకం,చతుర్వేద పారాయణం,ప్రతి సంవత్సరం మాఘశుద్ధపూర్ణిమ రోజున స్వామివారి జగాజ్యోతి ప్రజ్వలన మరియు వార్షిక కల్యాణం జరుపబడును.
ఈ క్షేత్రాన్ని ముమ్మారు దర్శించినచో ద్వాదశ జ్యోతిర్లింగాలు , అష్టా దశ శక్తి పీఠములు దర్శించిన ఫలితం కలుగుతుంది.
సమాచారం కోసం సంప్రదించండి.గొర్రెపాటి వెంకటరామకృష్ణ గారు 9985463899