జగన్ ఓదార్పు యాత్ర Back to list

 జగన్ ఓదార్పు యాత్ర 

 

ఓదార్పు యాత్ర లో భాగం గా ఈ నెల 23 న Y.S.R కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఘంటసాల రానున్నారు.C.B.I తనిఖిలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణం లో జగన్ మన గ్రామానికి ఓదార్పు యాత్ర కి రావటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.రామయ్య కొట్టు సెంటర్ లో ప్రసంగించిన అనంతరం ఆ రాత్రికి దేవరకోట లో బస చేస్తారు.

 
సరిగ్గా ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తన జన్మ స్థలమైన దేవరకోట విచ్చేసి తమ పూర్వీకులను కలుసుకున్నారు.ఆంధ్రజ్యోతి పేరు వింటేనే నిప్పులా ఎగసిపడే జగన్ ఇప్పుడు అదే రాధా కృష్ణ జన్మ స్థలమైన దేవరకోట లోనే బస చేయటం కొసమెరుపు.

వేమూరి ప్రసాద్ (షావుకారు) వేమూరి వెంకటరావు (వైన్ షాపు) గొర్రెపాటి గోపాలకృష్ణ యాత్ర ఏర్పాట్లను ఘనం గా చేస్తున్నారు.